నేతలపై కేసుల వివరాలతో ప్రత్యేక వెబ్ సైట్
ప్రజా ప్రతినిధులపై పెండింగ్ లో ఉన్న ఆర్ధిక నేరాల కేసులు, క్రిమినల్ కేసులను వీలైనంత తొందరగా పరిష్కరించాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. నేతలపై పెండింగ్ లో ఉన్న వివిధ కేసుల వివరాలు, మధ్యంతర ఆదేశాలు, స్టేలు వంటి వివరాలన్నీ కొత్త వెబ్ సైట్ లో పొందుపరచనున్నది. ఇందుకై అడిషనల్ ఎస్. పి. ఎం. ఎ. బారీ ని నోడల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర డి జి పి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
No comments:
Post a Comment