ఆన్ లైన్ మార్కెట్లో అసలైన పోరుకు సై
ఈ-కామర్స్ వ్యాపారంలోకి రిలయన్స్.
అమెజాన్,ఫ్లిప్ కార్ట్ లకి చెక్ పెట్టనున్న ముఖేష్ అంబానీ.
భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చైనాలోని "అలీబాబా" తరహాలో ఇండియాలో ఈ-కామర్స్ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ షాప్పింగ్ మార్కెట్ లో గరిష్ట వాటా దక్కించుకోవాలన్న తన కళను సాకారం చేసుకునేందుకు రూ. 1.73 లక్షల కోట్ల తో పూర్తి యాజమాన్య హక్కులతో సబ్సిడరీ ని ఏర్పాటు చేస్తున్నారు. రూ. 65,000 కోట్లతో ఏర్పడే హోల్డింగ్ కంపెనీకి రిలయన్స్ జియో లో కంపెనీ కి ఉన్న రూ. 65,000 కోట్ల ఈక్విటీ పెట్టుబడిని తరలిస్తారు. అమెజాన్, ప్లిప్ కార్ట్, వాల్ మార్ట్,స్నాప్ డీల్ లతో తలపడేందుకు భారీ పెట్టుబడితో అంబానీ అడుగు పెడుతుండడంతో ఈ-కామర్స్ వ్యాపారములో రసవత్తర పోరుకు తెరలేవనుంది.
No comments:
Post a Comment